
కళ్యాణ్ రామ్-విజయశాంతి తల్లీ కొడుకులుగా చేసిన ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ’ ఈ నెల 18న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ వైజయంతీగా నటించారు.
క్రిమినల్స్ని అణచివేయడంలో ఆమెకు సాయపడే కొడుకు అర్జున్గా కళ్యాణ్ రామ్ నటించారు. ఈ సినిమాలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, సవహేళ ఖాన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోకా క్రియేషన్స్ బ్యానర్లపై ముప్పా వెంకయ్య చౌదరి, సునీల్ బులుసు కలిసి నిర్మించిన ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి, సంగీతం అజనీష్ లోక్నాధ్, కెమెరా: రామ్ ప్రసాద్, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు.