
మల్లేశం, 8 ఏఎం మెట్రో సినిమాలతో మెప్పించిన రాజ్ ఆర్ దర్శకత్వంలో యధార్ధ ఘటనల ఆధారంగా తీస్తున్న ‘23’ అనే ఓ సినిమా వస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విక్రమార్క ఈరోజు హైదరాబాద్లో ఈ సినిమా పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో జాన్సీ, తేజ, తన్మయి, పవన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
1991లో జరిగిన చుండూరులో దళితుల ఊచకోత, 1993లో చిలకలూరిపేటలో బస్సులో సజీవదహనం, 1997 జూబ్లీహిల్స్ బాంబ్ బ్లాస్ట్ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు.
“మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా?” అంటూ దర్శకుడు రాజ్ సంధించిన ప్రశ్నకు సమాధానమే ఈ సినిమాలో చూపించబోతున్నారు.
ఈ సినిమాకి సంగీతం: మార్క్ కే రాబిన్, కెమెరా: సన్నీ కూరపాటి, డైలాగ్స్: ఇండస్ మార్టిన్, పాటలు: చంద్రబోస్, రహమాన్, ఇండస్ మార్టిన్, ఎడిటింగ్: అనిల్ ఆలయం, ఆర్ట్: విష్ణువర్ధన్ పుల్ల చేశారు.
స్టూడియో 99 బ్యానర్పై తీసిన ఈ సినిమాని ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా త్వరలో విడుదల చేయబోతోంది.