
బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటిస్తున్న నటీనటులందరి ఫస్ట్-లుక్ పోస్టర్స్ విడుదల చేశారు.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ శివపార్వతులుగా నటిస్తుండగా, ప్రభాస్ నందీశ్వరుడుగ నటిస్తున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పోస్టర్స్ విడుదల చేశారు.
కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభాస్ అభిమానులు ‘కన్నప్ప’కి ప్లస్ పాయింట్ అవుతారని భావిస్తున్నందున ప్రభాస్ ఫస్ట్-లుక్ పోస్టర్ మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేయబోతున్నామని కన్నప్ప చిత్ర బృందం ట్వీట్ చేసింది.
కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. ఈ సినిమాలో మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్: చిన్న చేస్తున్నారు.
ఈ సినిమాపై మంచు విష్ణు, మోహన్ బాబు చాలా ఆశ పెట్టుకున్నారు. ఈ సినిమా తప్పకుండా సూపర్ డూపర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే అవా ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 25న కన్నప్ప ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.