
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై చాలా నమ్మకంతో ఉన్నారు. అందుకే అనేక మంది హేమాహేమీలను తన సినిమాలో తీసుకొని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. కన్నప్ప ఏప్రిల్ 25 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించి రిలీజ్ పోస్టర్గా డమరుకం-త్రిశూలం ఫోటోని పెట్టారు. ఈ సినిమాలో మహాదేవ శాస్త్రిగా నటిస్తున్న మోహన్ బాబు పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆయన ఇటువంటి పాత్రలు అవలీలగా చేసి మెప్పించగలరు.
‘మహాభారత్’ హిందీ సీరియల్కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్పని నిర్మిస్తున్నారు. కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ నటిస్తోంది.
శివపార్వతులుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, నందీశ్వరుడుగా ప్రభాస్ నటిస్తున్నారు. బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
కన్నప్ప సినిమాకు మణిశర్మ, స్టీఫెన్ దేవాస్సీ: సంగీతం, షెల్డన్ షావ్: కెమెరా, చిన్న ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు.
ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.