
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేస్తున్న ‘తండేల్’ నుంచి ‘ఓ బుజ్జి తల్లి నీకోసం... ‘ అంటూ మృధుమధురంగా సాగే పాట విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటని దేవీశ్రీ ప్రసాద్ స్వరపరచగా, జావేద్ అలీ ఎంతో మృధుమధురంగా పాడారు.
పాటకి సంగీతం, పాట సాహిత్యం చాలా బాగున్నాయి. ఆ పాటలో నాగచైతన్య-సాయి పల్లవిలను చూపిన తీరు ఇంకా అద్భుతంగా ఉంది. ‘తండెల్’ ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో ఓ యధార్ధ గాధ, ఘటనల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మత్స్యకారుల జీవితాన్ని ఈ సినిమాలో చూపబోతున్నారు.
ఈ సినిమాకి దర్శకత్వం: చందూ మొండేటి, కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.