
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన దేవర సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈరోజు (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్లోని హైటెక్స్ నోవాటెల్ హోటల్లో జరుగబోతోంది. ఈ కార్యక్రమానికి దర్శకులు రాజమౌళి, త్రివిక్రం శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ అతిధులుగా రాబోతున్నారు. మహేష్ బాబు ముఖ్య అతిధిగా వస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా ప్రీ-రిలీజ్ ట్రైలర్ ఈరోజు ఉదయం 11.07 గంటలకు విడుదల చేస్తామని దేవర టీమ్ ప్రకటించిది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట కావస్తున్నా ఇంకా విడుదల కాలేదు. అనివార్య కారణాల వలన ఆలస్యం అవుతోందని, కొద్ది సేపటిలో అప్డేట్ ఇస్తామని దేవర టీమ్ తెలియజేసింది. సినిమా విడుదలయ్యే సమయానికి ఇలాంటి అప్డేట్స్ కాస్త ఆలస్యం అవుతుంటాయి కానీ పర్వాలేదు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం,” అని దేవర టీమ్ సర్ధి చెపుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న దేవర మొదటి భాగం ఈ నెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈరోజు సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ పూర్తవగానే దేవర సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఏ కారణం చేతైనా నేడు ప్రారంభం కాకపోతే రేపు ఉదయం నుంచి ఖచ్చితంగా ప్రారంభం అవుతుంది.