
శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ చంద్, కావ్య థాపర్ జంటగా చేస్తున్న ‘విశ్వం’ సినిమా నుంచి నేడు మొరాకో మగువ... అంటూ హుషారుగా ఫాస్ట్ బీట్తో సాగే లిరికల్ సాంగ్ విడుదలైంది. రాకేందు మౌళి వ్రాసిన ఈ పాటని చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చగా, పృధ్వీ చంద్ర, సాహితి చాగంటి హుషారుగా పాడారు.
చాలా కాలంగా హిట్ పడక గోపీచంద్ రేసులో వెనకబడిపోయాడు. కానీ ‘విశ్వం’తో దర్శకుడు శ్రీను వైట్ల తప్పకుండా హిట్ అందించేలానే ఉన్నాడు. ఇద్దరి మాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాలో రొమాన్స్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నీ సమపాళ్ళలో వేసినట్లే టీజర్ చెపుతోంది.
విశ్వంలో నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ, ముకేష్ రిషి, జీషు సేన్ గుప్తా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ: గోపీ మోహన్, భాను- నాయుడు, ప్రవీణ్ వర్మ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, స్టంట్స్: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నే చేస్తున్నారు.
దోనెపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ , వేణుస్వామి దోనెపూడి కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.