
మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తీస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్లో ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ల దర్శకత్వంలో చిరంజీవి, విలన్ గ్యాంగ్స్పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
సోషియో ఫాంటసీ చిత్రంగా వస్తున్న దీనిలో చిరంజీవి భీమవరం దొరబాబుగా ఆయనకు జంటగా త్రిష నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి, కునాల్ కపూర్, ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాధ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. దీనిలో ఆరు పాటలుంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలిపారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న విశ్వంభర వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.