శర్వానంద్ మనమే జూన్ 7న రిలీజ్

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ కృతి శెట్టి జంటగా రూపొందిన మనమే సినిమా జూన్ 7వ తేదీన విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఇన్ని రోజులూ రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొని ఉన్నందున చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడటంతో రాజకీయ హడావుడి ముగుస్తుంది కనుక మళ్ళీ సినిమాలన్నీ వరుసపెట్టి విడుదలకాబోతున్నాయి. ముందుగా జూన్ 7వ తేదీన మనమే వస్తోంది.   

‘మనమే’ సినిమా నుంచి ‘ఐఫిల్ టవరే ఒంటరిగా...’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ కొన్ని రోజుల క్రితమే విడుదలైంది. ఇప్పుడు సినిమా రిలీజ్ ప్రకటన వచ్చేసింది. కనుక త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు.    

మనమే సినిమాకు కధ, దర్శకత్వం శ్రీరామ్ ఆదిత్య, డైలాగ్స్: అర్జున్, కార్తీక్, ఏఆర్ టాగూర్, వెంకట్ డి పతి, సంగీతం: హెషామ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: విష్ణుశర్మ, జ్ఞాన శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం, శోబి, శ్రష్టి వర్మ, విజయ్‌ పోలకి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: జానీ షేక్, స్టంట్స్‌: రియల్ సతీష్, కెఎన్ఆర్ (నిఖిల్) చేస్తున్నారు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ రామస్వామి కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా నిర్మించారు.