త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా ఆగస్ట్ రెండో వారంలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. గతంలో వారి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మళ్ళీ 19 ఏళ్ళ తరువాత వారిరువురూ కలిసి ఈ సినిమా చేయబోతున్నారు కనుక ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉంటాయి.
ఇప్పుడు ఆ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త వినపడుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా రెండు పాత్రలు (డబుల్ రోల్) చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబు అనేక సినిమాలు చేశాడు కానీ డబుల్ రోల్ ఉన్న సినిమా ఒక్కటీ చేయలేదు. కనుక ఇదే నిజమైతే మహేష్ బాబు అభిమానులకు పండగే.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజ హెగ్డేని ఖరారు చేశారు. ఒకవేళ డబుల్ రోల్ చేస్తున్నట్లయితే మరో హీరోయిన్ కావాల్సి ఉంటుంది.
హారిక అండ్ హాసిని బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మించబోతున్న ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఫైట్స్ రామ్, లక్ష్మణ్.
ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాకి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి28గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2023 వేసవిలో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఈ సినిమాలో ఇతర నటీనటుల గురించి ఇంకా తెలియవలసి ఉంది.
The Evergreen Combo of Super Star @urstrulyMahesh & our Darling Director #Trivikram is back to REIGN! 🔥
The most eagerly awaited #SSMB28 pre-production has started on EPIC proportions! Shoot starts This Aug✨
Be Ready for a MASSive Blast at the Screens ~ Summer 2023! pic.twitter.com/m4g6m3p9Ad