
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్కు సంబందించి తాజా సమాచారాన్ని ఆ సినిమా దర్శకుడు మోహన్ రాజా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా చిరంజీవి, సల్మాన్ ఖాన్లపై కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ ఖాన్తో ఉండే ఈ షెడ్యూల్ గురువారంతో పూర్తయిపోయిందని, ఆయనతో పని చేయడం మంచి అనుభూతిని కలిగించిందని దర్శకుడు మోహన్ రాజా తెలిపారు.
Finished an Amazing Schedule with the Mighty Man,Sweetness Personified
Dearmost Bhai @beingsalmankhan
Thanks Bhai for Making this So Comfortable and So Memorable 🙏
And Thanks to OUR pillar of Support @kchirutweets for making this happen for Our #GodFather@MusicThaman & Team pic.twitter.com/2ys8CUy6jo
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్కు తెలుగులో రీమేక్గా వస్తున్న గాడ్ ఫాదర్ను చిరంజీవి సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కాగా మద్యలో కరోనా సమస్యల వలన షూటింగ్ చాలా ఆలస్యమైంది.
ఈ సినిమాలో సత్యదేవ్, గంగవ్వ, ఇంద్రజీత్ సుకుమారన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నీరవ్ షా కెమెరా, ఎస్. ధమన్ సంగీతం అందిస్తున్నారు.