ఈసారి కేంద్ర ఆర్ధిక బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కూడా కలిపి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దానిలో రైల్వేలకు సంబంధించిణ హైలైట్స్ :
1. రైల్వే బడ్జెట్ రూ.1.31 లక్షల కోట్లు
2. ఐ.ఆర్.సి.టి.సి. ద్వారా ఆన్-లైన్లో టికెట్లపై సర్వీస్ చార్జ్ రద్దు.
3. దేశ వ్యాప్తంగా కొత్తగా 3500 కిమీ రైల్వే లైన్ల నిర్మాణం.
4. ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం.
5. మరో రెండేళ్ళలోనే అన్ని రైళ్ళలో బయో టాయ్లెట్స్ ఏర్పాటు.
6. రైల్వే రవాణాలో ప్రైవేట్ రంగానికి ఆహ్వానం.
7. పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్ళు.
8. 5000 రైల్వే స్టేషన్లలో వృద్ధుల కోసం లిఫ్టుల ఏర్పాటు.
9. 25 రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ.
10. రైల్వేలలో సౌర విద్యుత్ వినియోగం.
11. రైల్వేల భద్రతకు ప్రత్యేకంగా మూలనిధి ఏర్పాటు.