డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులకు మరోసారి పోలీస్ కస్టడీ

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ఫామ్‌హౌసు డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలతో పాటు ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మలకు మరో 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతించింది. 

ఈ కేసులో వీరి ముగ్గురిని ప్రశ్నించేందుకు ఇదివరకే న్యాయస్థానం ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.,పోలీసుల అభ్యర్ధన మేరకు నేడు మరో 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. వారు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం వారి పిటిషన్లను కొట్టివేసింది. 

Related news link: https://www.mytelangana.com/telugu/Admin/updateNewsContent/41915/viewNewsContents