సోమవారం ఉత్తర తెలంగాణాలో పవర్ కట్

సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలలోని జైనూరు, సిర్పూర్ మండలలో విద్యుత్ సరఫరా ఉండదు. పొరుగునే ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి తెలంగాణాకి వేసిన హాయ్ టెన్షన విద్యుత్ లైన్లని కలపడానికి రేపు ఈ రెండు జిల్లాలలో విద్యుత్ సఫరా నిలిపివేయబోతున్నారు. రెండేళ్ళ క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం 1000 మెగావాట్స్ విద్యుత్ సరఫరాకి ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. దాని కోసమే విద్యుత్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి కూడా తెలంగాణా రాష్ట్రానికి ఆదనపు విద్యుత్ లభిస్తుంది.