ఛలో బస్ భవన్‌: సిటీ బస్సులో హరీష్ రావు

టీజీఎస్ ఆర్టీసీ సిటీ బస్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ బీఆర్ఎస్‌ పార్టీ నేడు ‘ఛలో బస్ భవన్‌’కి పిలుపునిచ్చింది. దీనిలో పాల్గొనేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు సిటీ బస్సులో ప్రయాణించారు.

ఈ సందర్భంగా అయన ప్రయాణికులతో మాట్లాడుతూ, “మెహిదీపట్నం నుంచి  బస్ భవన్‌కి మొన్నటి వరకు టికెట్ చార్జి రూ.30 ఉండేది. ఇప్పుడు అది రూ.40కి పెరిగింది. అంటే రానూపోనూ రోజుకి రూ.20 చొప్పున నెలకు రూ.600 భారం పేద, మధ్యతరగతి ప్రజలపై ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసింది.

ఓ పక్క మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెపుతూ, మళ్ళీ ఈ విదంగా ఛార్జీలు పెంచి ప్రజల నుంచి ఆ డబ్బువెనక్కు తీసుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచనే కదా? దీనిని మేము ఖండిస్తున్నాము...” అంటూ హరీష్ రావు అన్నారు. అయన ఏమన్నారో ఆయన మాటల్లోనే....