ముల్లుని ముల్లుతోనే తీయాలనట్లు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ చేత కేసీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడంతో, బిఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులతోనే యుద్ధానికి సై అంటోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్పై వ్యక్తిగత కక్ష, ద్వేషంతో కాళేశ్వరంతో సహా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయకుండా వదిలేశారని బిఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. కనుక కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు ఎక్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
✴️ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై పోరుకు బీఆర్ఎస్ రెడీ
— BRS Party (@BRSparty) June 18, 2025
✴️ రైతుల పక్షాన మరో పోరాటానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ పార్టీ
✴️ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి సారథ్యంలో త్వరలో బీఆర్ఎస్ ఉన్నత స్థాయి సమావేశం
✴️… pic.twitter.com/8q8UJ6E4Ss