తెలంగాణలో 21 మంది ఐపీస్ అధికారులు బదిలీ

తెలంగాణలో ఇప్పటికే చాలాసార్లు ఐఏఎస్, ఐపీస్ అధికారులు బదిలీలు జరిగాయి. తాజాగా నేడు మరోసారి 21 మంది ఐపీస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయినవారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీలు, ఇద్దరు డీఐజీలు, 14 మంది ఎస్పీలు, ఇద్దరు నాన్-క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. ఆ వివరాలు:   

అంబర్‌ కిషోర్‌ ఝా: రామగుండం సీపీ,

సన్‌ప్రీత్‌ సింగ్‌- వరంగల్‌ సీపీ,

సింధూశర్మ- ఇంటెలిజెన్స్‌ ఎస్పీ, 

రాజేష్‌ చంద్ర- కామారెడ్డి ఎస్పీ, 

సాయిచైతన్య- నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, 

గౌస్‌ ఆలం- గా కరీంనగర్‌ సీపీ, 

అఖిల్‌ మహజన్‌- ఆదిలాబాద్‌ ఎస్పీ, 

రూపేష్‌- నార్కోటిక్‌ బ్యూరో ఎస్పీ, 

అక్షాన్ష్‌ యాదవ్‌- భువనగిరి డీసీపీ, 

పంకజ్‌ పరితోష్‌- సంగారెడ్డి ఎస్పీ, 

గీతే మహేష్‌ బాబా సాహెబ్‌- సిరిసిల్ల ఎస్పీ, 

అంకిత్‌ కుమార్‌- వరంగల్‌ డీసీపీ, 

భాస్కర్‌- మంచిర్యాల డీసీపీ, 

కరుణాకర్‌- పెద్దపల్లి డీసీపీ, 

శిల్పవల్లి- సెంట్రల్‌ జోన్‌ డీసీపీ, 

నరసింహ - సూర్యాపేట ఎస్పీ, 

ఎం.శ్రీనివాసులు- సీఐడీ ఐజీ, 

పి.రవీందర్‌- సీఐడీ ఎస్పీ, 

వై.సాయిశేఖర్‌ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎస్పీ, 

అనిల్‌కుమార్‌ - అడిషనల్‌ డీజీపీ (పర్సనల్‌), 

చేతన: ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఎస్పీగా నియమితులయ్యారు.