తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి, కొందరు సీనియర్ అధికారుల బృందం శనివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు బయలుదేరారు.
రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన షెడ్యూల్:
ఆగస్ట్ 4: న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణవాసులతో సమావేశం. వారిని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహిస్తారు.
ఆగస్ట్ 5,6: న్యూయార్క్లో పెప్సీ కో, హెచ్సీఏ కంప్యూటర్స్ కంపెనీల ప్రతినిధులతో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించి, వీలైతే ఒప్పందాలు చేసుకుంటారు.
ఆగస్ట్ 7: డల్లాస్ నగరంలో వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ. గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.
ఆగస్ట్ 8: శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్, ట్రైనేట్ సంస్థల సీఈవోలతో భేటీ అవుతారు.
ఆగస్ట్ 9: గూగుల్, అమెజాన్ సంస్థల రతినిధులతో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం ప్రవాస తెలంగాణవాసులతో సమావేశమవుతారు.
దక్షిణ కొరియాలో పర్యటన షెడ్యూల్:
ఆగస్ట్ 11: సియోల్ నగరం చేరుకుంటారు.
ఆగస్ట్ 11,12: ఎల్జీ, శాంసంగ్ తదితర దక్షిణ కొరియా కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు.
ఆగస్ట్ 13: అర్దరాత్రి హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు.