లోక్‌సభ, శాసనసభ ఎన్నికల షెడ్యూల్ జారీ

ఈరోజు (శనివారం) మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమీషనర్‌ రాజీవ్ కుమార్‌ లోక్‌సభ మరియు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వస్తుందని రాజీవ్ కుమార్‌ చెప్పారు. 

ఏపీ శాసనసభ మరియు, ఏపీ,  తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్: 

నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 

నామినేషన్స్‌ స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్‌ 25,      

నామినేషన్స్‌ పరిశీలన: ఏప్రిల్‌ 26,

నామినేషన్స్‌ ఉపసంహరణకు గడువు: ఏప్రిల్‌ 29,

పోలింగ్‌: మే 13 

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: జూన్ 6వ తేదీ.