ఈనెల 22న సిఎం కేసీఆర్‌ వాసాలమర్రి గ్రామ పర్యటన

సిఎం కేసీఆర్‌ ఈనెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామ పర్యటనకు వెళ్ళనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జనగామ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో వాసాలమర్రిలో ఆగి గ్రామ పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. అప్పుడే ఆ గ్రామాన్ని దత్తత తీసుకొంటున్నట్లు ప్రకటించి గ్రామంలో మౌలికవసతులు కల్పించి అభివృద్ధి చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ గ్రామం పరిస్థితి ఏవిదంగా ఉందో స్వయంగా పరిశీలించేందుకు సిఎం కేసీఆర్‌ 22న అక్కడికి వెళ్ళబోతున్నారు. సిఎం కేసీఆర్‌ పర్యటన ఖరారు అవడంతో జిల్లా కలెక్టర్ పమెలా సత్పత్తి ఆ గ్రామానికి వెళ్ళి అభివృద్ధి పనులను పరిశీలించి సిఎం కేసీఆర్‌ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయిస్తున్నారు.