సంబంధిత వార్తలు

కేంద్ర ఎన్నికల కమీషన్ ఈరోజు నాగార్జునసాగర్ శాసనసభ స్థానానికి, తిరుపతి లోక్సభ స్థానానికి ఉపఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. సాగర్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.
సాగర్, తిరుపతి ఉపఎన్నికల షెడ్యూల్:
మార్చి 23: నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
మార్చి 30: నామినేషన్ల దాఖలుకి గడువు
మార్చి 31: నామినేషన్ల పరిశీలనఏప్రిల్ 3: నామినేషన్ల ఉపసంహరణకు గడువు
ఏప్రిల్ 17: పోలింగ్
మే 2: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.