నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. రేపు ఉభయసభలు సమావేశమవగానే మొదట ఇటీవల మృతి చెందిన టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. తరువాత గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవధాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చించి ఆమోదం తెలుపుతారు. మార్చి 18న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్‌రావు శాసనసభలో 2021-22 బడ్జెట్‌ ప్రవేశపెడతారు. బీఏసీ సమావేశంలో అజెండా, షెడ్యూల్ ఖరారు చేస్తారు.