నేడు ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌... అందుకేనా?

మంగళవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ నిర్వహించబోతున్నట్లు తాజా సమాచారం. బహుశః జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం కోసమే ప్రెస్‌మీట్‌ పెడుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈనెల 22న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి, డిసెంబర్‌ 6న పోలింగ్ నిర్వహించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలు నిజమోకాదో మరికొద్దిసేపటిలో తేలిపోనుంది.