తెలంగాణ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుల నియామకం

కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణలో కొత్తగా ఏర్పడబోయే 2 జిల్లాలతో కలిపి మొత్తం 33 జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులను నియమించింది. వారిలో బీసీలు-12, రెడ్డి-9, కమ్మ-2, బ్రాహ్మణ-2,ఎస్సీ-2, ఎస్టీలు-2, వెలమ-1, ముస్లిం-1 చొప్పున పదవులు లభించాయి. 

ఒక వ్యక్తికి ఒకే పదవి అనే నియమాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యేలకు కూడా ఈ పదవులు కట్టబెట్టడం విశేషం. ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి-వికారాబాద్, ఆత్రం సక్కు-ఆసిఫాబాద్, వణమా వెంకటేశ్వరులు-భద్రాద్రి జిల్లాలకు కాంగ్రెస్‌ అధ్యక్షులుగా నియమించింది. ఎమ్మెల్యేలకె కాక వారి భార్యలకు కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించడం మరో విశేషం. ఖమ్మం పట్టణానికి చెందిన దీపక్ చౌదరిని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు.

       జిల్లా

     డీసీసీ అధ్యక్షులు

మెదక్‌  

తిరుపతి రెడ్డి

రంగారెడ్డి

చల్లా నరసింహారెడ్డి

మేడ్చల్‌-మల్కాజిగిరి     

కూన శ్రీశైలం గౌడ్‌

సంగారెడ్డి         

నిర్మలాగౌడ్‌

కామారెడ్డి

కైలాస్ శ్రీనివాసరావు

సిద్ధిపేట

టి. నరసారెడ్డి

నల్గొండ

కె.శంకర్ నాయక్

యాదాద్రి భువనగిరి

బి.లక్ష్మయ్య గౌడ్

వరంగల్ రూరల్/అర్బన్

నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్ నగర కాంగ్రెస్‌

కేదారి శ్రీనివాసరావు

ఖమ్మం

పువ్వాడ దుర్గాప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం

వణమా వేంకటేశ్వర రావు

వనపర్తి

శంకర్ ప్రసాద్

జోగులాంబ గద్వాల

పటేల్ ప్రభాకర్ రెడ్డి

నాగర్ కర్నూల్

సిహెచ్ వంశీకృష్ణ

సూర్యాపేట

సిహెచ్ వెంకన్న యాదవ్  

కరీంనగర్

కె.మృత్యుంజయమ్

పెద్దపల్లి

ఈర్ల కొమురయ్య

జగిత్యాల

లక్ష్మణ్ కుమార్

మంచిర్యాల

కొక్కిరాల సురేఖ

రాజన్న సిరిసిల్ల

ఎన్. సత్యనారాయణ గౌడ్   

నిజామాబాద్‌

మనాల మోహన్ రెడ్డి

నిజామాబాద్‌ నగర కాంగ్రెస్‌

కేశ వేణు

కొమరం భీమ్ ఆసిఫాబాద్

ఆత్రం సక్కు

వికారాబాద్

పి.రోహిత్ రెడ్డి

నిర్మల్

రామారావు పటేల్ పవార్

జయశంకర్ భూపాలపల్లి

గండ్ర జ్యోతి

జనగామ

జంగా రాఘవ రెడ్డి

మహబూబ్‌నగర్‌

కొత్వాల్ ఒబేదుల్లా

మహబూబాబాద్

జె.భారత్ చంద్రారెడ్డి