ప్రధాని నరేంద్ర మోడీ భార్య యశోదా బెన్ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ఆమె మరొక నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్ లో కోట అనే ప్రాంతం నుంచి రాజస్థాన్ లోని చిత్తోర్ ఘడ్ కు కారులో వెళుతుండగా అదుపుతప్పి ఒక ట్రక్కును బలంగా డ్డీకొంది. ఈ ప్రమాదంలో జసోదా బెన్ దగ్గర బంధువు బసంత్ భాయ్ మోడీ (67) మృతి చెందగా మిగిలిన నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో జసోదా బెన్ ప్రయాణిస్తున్న కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. రాజస్థాన్ లో పర్సోలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని చిత్తోర్ ఘడ్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. జసోదా బెన్ తో సహా అందరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారు.