ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రచార కర్తలుగా అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు!!.

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక ప్రచార కర్తలుగా ప్రముఖ బాలీవుడ్‌ నటులు అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు వ్యవహరించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం విజయవాడలోని సీఎం కార్యాలయంలో అజయ్‌దేవగణ్‌, కాజోల్‌ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ప్రచారకర్తలుగా పనిచేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. వీరి ప్రతిపాదనను అంగీకరిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వినోదం, మీడియా, క్రియేటివ్‌ సిటీ ప్రాజెక్టు చేపట్టేందుకు అజయ్‌దేవగణ్‌ సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను విలక్షణమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు..అజయ్‌దేవగణ్‌తో అన్నారు. సీఎంతో భేటీ అనంతరం అజయ్‌గేవగణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు పనితీరు నాకు చాలా ఇష్టం. అందుకే కలిసేందుకు వచ్చా. గత 25ఏళ్లుగా హైదరాబాద్‌ను చూస్తున్నా. చంద్రబాబు హయాంలో హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన నిబద్ధతను చూస్తే.. విజయవాడ సహా ఈ ప్రాంతమంతా కచ్చితంగా అభివృద్ధి చెందుతుంది.