ప్రస్తుతం పారిస్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్-2024 పోటీలలో భారత్కు రెండో పతకం వచ్చింది. మొదటి పతకం సాధించిన షూటర్ మను భాకర్, రెండో పతకం కూడా సాధించారు. అయితే సరబ్ జ్యోత్ సింగ్తో కలిసి పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని సాధించారు. భారత్-కొరియా మద్య జరిగిన ఈ ఈవెంట్లో మనూ భాకర్, సరబ్ జ్యోత్ సింగ్ 16-10 పాయింట్లతో విజయం సాధించారు.
భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పోటీలలో ఒకే ఈవెంట్లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచారు. భారత్ తరపున మొత్తం 117 మంది క్రీడాకారులు 16 క్రీడాంశాలలో పాల్గొనబోతున్నారు.