ఒలింపిక్స్-2024లో భారత్‌కు రెండో పతకం

July 30, 2024
img

ప్రస్తుతం పారిస్ నగరంలో జరుగుతున్న ఒలింపిక్స్-2024 పోటీలలో భారత్‌కు రెండో పతకం వచ్చింది. మొదటి పతకం సాధించిన షూటర్ మను భాకర్, రెండో పతకం కూడా సాధించారు. అయితే సరబ్ జ్యోత్ సింగ్‌తో కలిసి పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. భారత్‌-కొరియా మద్య జరిగిన ఈ ఈవెంట్‌లో మనూ భాకర్, సరబ్ జ్యోత్ సింగ్‌ 16-10 పాయింట్లతో విజయం సాధించారు. 

భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు జరిగిన పోటీలలో ఒకే ఈవెంట్‌లో వరుసగా రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా మనూ భాకర్ నిలిచారు. భారత్‌ తరపున మొత్తం 117 మంది క్రీడాకారులు 16 క్రీడాంశాలలో పాల్గొనబోతున్నారు. 


Related Post