దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్)పై సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఘన విజయం సాధించింది. ఐపిఎల్ సీజన్-14లో ఎస్ఆర్హెచ్ కు ఇది రెండో విజయం. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ మ్యాచ్లో ఆడే అవకాశాన్ని కోల్పోయింది. ఇదే ఆట తీరును మొదటి నుండి ప్రదర్శిస్తే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అంతకుముందు ఆర్ఆర్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్లో సంజు సాంసంన్ 82 పరుగులతో అదరగొట్టాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఎస్ఆర్హెచ్ 165 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే చేధించి విజయం సాధించింది. బ్యాటింగ్లో జాసన్ రాయ్ 60, కెన్ విలియమ్సన్ 51 పరుగులతో టాప్ స్కోరర్స్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో జాసన్ రాయ్ (ఎస్ఆర్హెచ్)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఐపీఎల్లో ఈ రోజు రెండు కీలక మ్యాచ్లు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మద్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మాచ్ ప్రారంభమవుతుంది.
మరో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మద్య జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మాచ్ రాత్రి ఏడున్నర గంటలకు ప్రారంభమవుతుంది.