ఐపీఎల్ సీజన్-14 రెండవ విడతలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(అర్సీబి) ముంబై ఇండియన్స్ (ఎంఐ)ను 54 పరుగుల తేడాతో ఓడించింది. ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో అర్సీబి వర్సెస్ ఎంఐ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఎంఐ టాస్ గెలిచి అర్సీబికి బ్యాటింగ్ అప్పజెప్పింది. అర్సీబి నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. బ్యాటింగ్లో మరోసారి విరాట్ కోహ్లీ 51 పరుగులతో చెలరేగిపోయాడు. అతనికి గ్లెన్ మాక్సివెల్ 56 పరుగులతో చక్కని సహకారం అందించాడు. అర్సీబి ఇచ్చిన 166 పరుగుల లక్ష్యాన్ని ఎంఐ చేధించలేకపోయింది. అర్సీబి బౌలర్లు ఎం ఐ బ్యాట్స్ మెన్ను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఎంఐ 18.1 ఓవర్లలో 111 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్లో అల్ రౌండ్లో ప్రతిభ కనపరిచిన గ్లెన్ మాక్స్ వెల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో అర్సీబి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి వచ్చింది.