కేకేఆర్ పై సిఎస్కే విజయం

September 27, 2021
img

యూఏఈ అబుదాబి షేక్ జియాద్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కోల్ కత నైట్ రైడర్స్(కేకేఆర్)పై  చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకూ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. రెండు టీంలు గెలిచేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ అంతిమ విజయం సి ఎస్ కె దే. అంతకుముందు  కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్ లో రాహుల్ త్రిపాఠి 47 పరుగులతో  టాప్ స్కోరర్ గా నిలిచాడు.  సి ఎస్ కె ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన బ్యాట్ మ్యాన్ ఒత్తిడి లేకుండా ఆడారు. సి ఎస్ కె 176  పరుగుల లక్ష్యాన్ని 20 ఓవర్లలో చేదించి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో  ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్ లో రవీంద్ర జడేజా (సి ఎస్ కె ) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Related Post