యుఏఈ, షార్జా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) ఓటమి పాలైంది. సిఎస్కే టీం టాస్ గెలిచి ఆర్సిబిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. ఇది ఆర్సిబి టీంకు శుభసూచకం. విరాట్ కోహ్లీ స్టేడియం నలువైపులా షాట్లు కొడుతూ ప్రేక్షకులను అలరించాడు. ఆర్సిబి టీం నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసి ఆరు వికెట్లను కోల్పోయింది. బ్యాటింగ్లో దేవ్దత్ పడికల్ 70, విరాట్ కోహ్లీ 53 పరుగులతో టాప్ స్కోరర్స్గా ఉన్నారు. ఆర్సిబి ఇచ్చిన 157 పరుగుల లక్ష్యాన్ని సిఎస్కే 18.1 ఓవర్లలోనే చేధించి విజయం సాధించింది. ఈ క్రమంలో నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ మ్యాచ్లో డ్వాన్ బ్రావో(సిఎస్కే)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిఎస్కే టీం పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది.