యూఏఈ, అబుదాబి షేక్ జియాద్ స్టేడియంలో గత రాత్రి జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్(ఎంఐ)పై కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ఘన విజయం సాధించింది. ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో ఇదే అత్యుత్తమ మ్యాచ్గా నిలిచింది. రెండు టీంలు చక్కని పోరాట పటిమను ప్రదర్శించాయి. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం టాస్ గెలిచి ఎంఐను బ్యాటింగ్కు ఆహ్వానించింది.
ఎంఐ ఓపెనర్లు ధాటిగా ఆట ప్రారంభించారు. ఒక దశలో 20 ఓవర్లలో 200 పైగా పరుగులు చేసేలాగానే కనిపించారు. కానీ కేకేఆర్ బౌలర్ల అద్భుతమైన బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో 155 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఎంఐ బ్యాటింగ్లో క్వింటన్ డికాక్ 55 టాప్ స్కోరర్గా నిలిచాడు. ఎంఐ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ధాటిగా ప్రారంభించి, చివరి వరకు అదేవిదంగా కొనసాగింది. కేకేఆర్ టీం లక్ష్యాన్ని 15.1 ఓవర్లలోనే చేధించి విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వికెట్లను కోల్పోయింది. కేకేఆర్ బ్యాటింగ్లో రాహుల్ త్రిపాఠి 74 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఈ మ్యాచ్లో సునీల్ నరేన్కు మ్యాన్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ రోజు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.