సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం

September 23, 2021
img

ఐపీఎల్ సీజన్-14 రెండో విడత మ్యాచ్‌లలో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టు ఓటమితో ప్రారంభించింది. బుధవారం రాత్రి ఎస్ఆర్‌హెచ్‌ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (డిసి)తో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మొదటి ఐదు ఓవర్లలోనే ఓపెనర్లు పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. దీంతో ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఎస్ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 134 పరుగులు చేసి తొమ్మిది వికెట్లను కోల్పోయింది. ఎస్ఆర్‌హెచ్ ఇచ్చిన ఈ 135 పరుగుల లక్ష్యాన్ని డీసీ కాస్త తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించింది.  ఆ తర్వాత నిలదొక్కుకొని 17.5 ఓవర్లలోనే 135 పరుగుల లక్ష్యాన్ని డీసీ చేధించింది. ఈ మ్యాచ్‌లో కాగిసో రబడ(డీసీ)కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో డీసీ పాయింట్ల  పట్టికలో తొలి స్థానంలోకి ఎగబాకింది.

భారత  కాలమాన ప్రకారం గురువారం రాత్రి ఏడున్నర గంటలకు ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. 

Related Post