భారత క్రికెట్ నియంత్రణ సంస్థ(బీసీసీఐ) క్రికెట్ అభిమానులకు శుభవార్త అందించింది. కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్లు అర్థంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే. మిగతా ఐపిఎల్ మ్యాచ్లను ఈనెల 19 నుంచి యూఏఈలో ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను ఐపీఎల్ మ్యాచ్లను వీక్షించేందుకు బిసిసిఐ అనుమతినిచ్చింది. ఈ మ్యాచ్లకు టికెట్ల విక్రయాలు గురువారం నుండి ప్రారంభం అవుతాయి. https://222.ipl20.com లేదా www.platinuml.ist.net వెబ్సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని బీసీసీఐ తెలిపింది.