పురుషుల హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో యూకే జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ జట్టు 3-1 గోల్స్ తేడాతో యూకే జట్టును ఓడించి పూల్-ఏలో రెండో స్థానానికి చేరుకుని సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియాజట్టుతో తప్ప మిగతా అన్నిజట్లతో ఆడిన మ్యాచ్లలో భారత్ జట్టు వరుసగా విజయాలు సాధించింది. తాజా విజయంతో సెమీ ఫైనల్స్ కు అర్హత సాధించింది. సెమీ ఫైనల్స్ లో కూడా ఇదే దూకుడును ప్రదర్శిస్తే భారత్కు ఒలింపిక్స్లో మరో పతకం వచ్చే అవకాశం ఉంటుంది. మంగళవారం జరిగే సెమీఫైనల్స్ లో భారత్ జట్టు బెల్జియం జట్టుతో తలపడనుంది.