టోక్యో ఒలింపిక్స్లో భారత్కు పీవీ సింధు మరో పతకం సాధించి పెట్టింది. ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పీవీ సింధు చైనాకు చెందిన క్రీడాకారిణి బింగ్ జియాతో పోటీ పడ్డారు. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి సింధు ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడుతూ వరుస సెట్లలో 21-13, 21,15 తేడాతో ఘనవిజయం సాధించింది. పీవీ సింధు 2016 రియో ఒలింపిక్స్లో రజత పతకం, ఇప్పుడు ఈ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలుగమ్మాయిగా చరిత్రలో నిలిచింది.