చెన్నై, చిదంబరం స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ను ఆరు పరుగుల తేడాతో ఓడించింది. అంతకుముందు సన్ రైజర్స్ టాస్ గెలిచి బౌలింగ్ను ఎంచుకుంది. ఆర్సిబి నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఆర్సిబి బ్యాటింగ్లో గ్లెన్ మాక్స్ వెల్ 59, విరాట్ కోహ్లీ 33 పరుగులతో టాప్ స్కోరర్స్గా ఉన్నారు. ఆర్సిబి 150 పరుగులు టార్గెట్ను సన్ రైజర్స్కు ఇచ్చింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ను చూసినట్లయితే ఆర్సిబి ఇచ్చిన టార్గెట్ను సులువుగా చేదించి విజయం సాధిస్తోందని ప్రేక్షకులు భావించారు. కానీ ఆర్సిబి అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలు కనబరిచి సన్ రైజర్స్ను ఓడించింది. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్లో డేవిడ్ వార్నర్, మనీష్ పాండేలు తప్ప మిగతా బ్యాట్స్ మెన్ అందరూ చాలా తక్కువ పరుగులు చేశారు. ఈ విజయంతో ఆర్సిబి రెండు పాయింట్లను సాధించింది.