సన్‌ రైజర్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం

April 12, 2021
img

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది.

అంతకుముందు సన్‌ రైజర్స్‌ టాస్ గెలిచి కెకెఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెకెఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు  కోల్పోయి187 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటింగ్‌లో నితేష్ రానా 80, తిరుపతి 52 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా  ఉన్నారు. కేకేఆర్ ఇచ్చిన భారీ లక్ష్యాన్ని సన్‌ రైజర్స్‌ తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లు ఇద్దరు పెద్దగా పరుగులు చేయకుండానే వెంట వెంటనే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మనీష్ పాండే, జానీ బెయిర్స్టో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఓటమిని ఆపలేకపోయారు. సన్‌ రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. సన్‌ రైజర్స్‌ బ్యాటింగ్‌లో మనీష్ పాండే 63, జానీ బెయిర్స్టో 55 పరుగులతో టాప్ స్కోరర్స్‌గా ఉన్నారు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: నితీష్ రానా (కెకెఆర్)కు దక్కింది.

ఐపీల్ సీజన్-14ను హైదరాబాద్ జట్టు ఓటమితో ప్రారంభించింది.

Related Post