ముంబైలోని వాంఖేడే స్టేడియంలో శనివారం జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
అంతకుముందు డీసీ టాస్ గెలిచి సీఎస్కేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. మొదట్లో సీఎస్కే కాస్త తడబడిన తర్వాత పుంజుకొని భారీ పరుగులు సాధించింది. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసి ఏడు వికెట్లను కోల్పోయింది. సీఎస్కే బ్యాటింగ్లో సురేష్ రైనా 56 పరుగులు చేసి టాప్ స్కోరర్గా ఉన్నారు. సిఎస్కె ఇచ్చిన భారీ పరుగుల లక్ష్యాన్ని డిసి ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీ షా మొదటి బాల్ నుంచే ధాటిగా ఆడటం ప్రారంభించి విజయాన్ని తేలిక చేశారు. డిసి 18.4 ఓవర్లలోనే 190 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీసీ మూడు వికెట్లను కోల్పోయింది. డీసీ బ్యాటింగ్లో శిఖర్ ధావన్ 85, పృథ్వీ షా 72 పరుగులతో టాప్ స్కోరర్స్గా ఉన్నారు.
శిఖర్ ధావన్ (డిసి)కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.