అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో నిన్నటి నుండి ప్రారంభమైన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇండియా పటిష్ట స్థితిలో ఉంది.
ఇండియా రెండో రోజు 24 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్కు వచ్చింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండానే అవుటయ్యి మరోసారి నిరాశ పరిచాడు. ఇండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ 49, రిషబ్ పంత్ 101, వాషింగ్టన్ సుందర్ 60 పరుగులతోనూ టాప్ స్కోరర్లుగా ఉన్నారు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ కలిసి మొత్తం 113 పరుగుల భాగస్వామ్యంతో ఇండియాను పటిష్ట స్థితికి చేర్చారు.
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు, బెన్ స్టోక్స్ రెండు, జాక్ లీచ్ రెండు వికెట్లు తీసుకున్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ సుందర్ 60, అక్షర్ పటేల్ 11 పరుగులతోను క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా 89 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :205
ఇండియా మొదటి ఇన్నింగ్స్ :294/7