ఇంగ్లాండ్ 205 ఫర్ ఆలవుట్

March 04, 2021
img

అహ్మదాబాద్ మోతేరా  స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ చివరి టెస్ట్ మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. మొదటిరోజు ఆటలోనే ఇండియా పట్టు బిగించింది. 

ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మరోసారి ఇండియా స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ 205 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో బెన్ స్టోక్స్ 55,  డేనియల్ లారెన్స్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌లుగా ఉన్నారు. మిగతా బ్యాట్ మెన్ అందరూ పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. ఇండియ స్పిన్నర్లలలో అక్షర్ పటేల్ 4, అశ్విన్ 3,  సిరాజ్‌కు 2, వాషింగ్టన్ సుందర్‌కు 1 వికెట్లు పడ్డాయి. 

ఆ తర్వాత ఇండియా మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగింది వచ్చింది. ఓపెనర్లుగా శుభమన్ గిల్, రోహిత్ శర్మ వచ్చారు. గిల్ పరుగులు ఖాతా తెరవకుండానే అండర్సన్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యు అయ్యి వెనుదిరిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పూజారా 15, రోహిత్ శర్మ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ పెట్టిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇండియా 181 పరుగులు సాధించవలసి ఉంది. 

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ :205

ఇండియా మొదటి ఇన్నింగ్స్ :24/1

Related Post