జస్ప్రిత్ బుమ్రాకు విశ్రాంతి

February 28, 2021
img

మార్చి 4వ తేదీన అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్  మ్యాచ్‌లో భారత్‌ జట్టులోని మీడియం పేసర్ జస్ప్రిత్ బూమ్రాకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. జస్ప్రిత్ బూమ్రా స్వయంగా విశ్రాంతి కావాలని కోరడంతో బీసీసీఐ అందుకు అనుమతించింది. మూడో టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్‌ జట్టుకు, తరువాత మ్యాచ్‌లో బుమ్రా ఆడకపోవడం బ్యాడ్ న్యూస్ ఛానల్‌పై అనే చెప్పాలి. ఇప్పటికే ఇండియా టెస్ట్ సిరీస్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించినా...లేదా డ్రా చేయగలిగినా ఈ టెస్ట్ సిరీస్ మనదే  అవుతుంది. ఇండియా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నాయి.


Related Post