ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్-14 మ్యాచ్‌లు

February 26, 2021
img

కరోనా కారణంగా ఐపీఎల్-13వ ఎడిషన్ దుబాయ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది గనుక ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లను భారత్‌లోనే నిర్వహించాలని క్రికెట్ అభిమానులు కోరుకొంటున్నారు. బీసీసీఐ వారి కోరికను మన్నిస్తూ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం అయ్యే ఐపీఎల్-14 ఎడిషన్‌లో మ్యాచ్‌లను ముంబాయి, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాలలో నిర్వహించాలని బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే దీనిపై బీసీసీఐ మరోసారి సమావేశమయ్యి చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుని వేదికలు ఖరారు చేయనుంది. 


Related Post