అహ్మదాబాద్, మోతేరా స్టేడియంలో నిన్న జరిగిన భారత్-ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ హైలైట్స్:
• దీంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత్ జట్టు 22 విజయాలు సాధించింది. అన్ని విజయాలను అందించిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పారు.
• అక్షర్ పటేల్ ఆడిన రెండో టెస్ట్ మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసిన క్రికెటర్గా రికార్డు సొంతం చేసుకున్నాడు. అక్షర్ పటేల్కు రెండు ఇనింగ్స్లో కలిపి మొత్తం 11 వికెట్లు పడ్డాయి.
• మూడో టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియం పేసర్లకు అవకాశం ఇవ్వలేదు.
• ఇంగ్లాండ్ పార్ట్ టైం బౌలర్ జో రూట్ మొదటిసారిగా ఐదు వికెట్లు తీశాడు.