అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది.
దీంతో ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండు రోజుల్లోనే ముగిసిన మ్యాచ్గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్ విజయంతో
భారత్ జట్టు వరల్డ్ బెస్ట్ టీమ్స్ జాబితాలో మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చింది.
అంతకుముందు భారత్ మొదటి ఇన్నింగ్స్లో 142 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో కేవలం 81 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. భారత స్పిన్నర్లు రెండు ఇన్నింగ్స్లో
మొత్తం 19 వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కుప్పకూల్చడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఇంగ్లాండ్
జట్టు భారత్కు 49 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్
ఒక వికెట్ కూడా నష్టపోకుండా 49 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ జట్టు 2-1 సిరీస్ ఆధిక్యంలో ఉంది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: రవిచంద్రన్
అశ్విన్
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్:112
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 81
భారత్ మొదటి ఇన్నింగ్స్: 142
భారత్ రెండో ఇన్నింగ్స్:49
భారత్-ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ మ్యాచ్ మార్చి 4వ తేదీ నుండి ప్రారంభమవుతుంది.
నాలుగో టెస్ట్ మ్యాచ్లో భారత్ డ్రా చేసిన సిరీస్ మనదే అవుతుంది.