మూడో టెస్ట్ మ్యాచ్ హైలైట్స్

February 25, 2021
img

అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్నటి నుండి మూడో డే అండ్ నైట్ మ్యాచ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిన్నటి మ్యాచ్ హైలెట్స్: 

• రెండు టెస్ట్ మ్యాచ్‌లలోనే ఆరు వికెట్లు తీసుకున్న మూడవ క్రికెటర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు.

• ఇషాంత్ శర్మకు ఈ మూడో టెస్ట్ మ్యాచ్‌తో 100 టెస్ట్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి.

• ఇంగ్లండ్ జట్టు కేవలం 112 పరుగుల అత్యల్ప స్కోర్‌ చేసింది.   

• అశ్విన్ లీచ్ వికెట్లు పడగొట్టడంతో 599 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అశ్విన్ కంటే ముందు మొదటి స్థానంలో కుంబ్లే, రెండోస్థానంలో హర్భజన్ సింగ్ ఉన్నారు. 

• నిన్నటి డే అండ్ నైట్ మ్యాచ్‌లో స్పిన్నర్లకు మొత్తం 9 వికెట్లు పడ్డాయి.

Related Post