అహ్మదాబాద్లోని మోతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య నిన్నటి నుంచి మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ అందరూ పెద్దగా పరుగులు చేయకుండానే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ లోజాక్ క్రేలెయ్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్కడే ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును కూల్చివేశాడు. అశ్విన్ కుమార్ మిగిలిన మూడు వికెట్లు తీసాడు.
ఆ తర్వాత భారత్ జట్టు బ్యాటింగ్కు వచ్చింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ వచ్చారు. గిల్ 11 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన చటేశ్వర్ పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. అతను పరుగులేమీ చేయకుండా అవుటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాసేపు ఇంగ్లాండ్ బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్నారు. కాసేపట్లో మ్యాచ్ ముగుస్తుందనగా విరాట్ కోహ్లీ 27 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్కు రెండు వికెట్లు పడ్డాయి.
మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 99 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం రోహిత్ శర్మ 57, అంజిక్య రహానే ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ 13 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్:112
భారత్ మొదటి ఇన్నింగ్స్:99/3