కార్తికేయ-1, కార్తికేయ-2తో రెండు వరుస హిట్స్ కొట్టిన యువహీరో నిఖిల్, ఇప్పుడు మరో సూపర్ హిట్ కొట్టేందుకు సిద్దమవుతున్నాడు. నిఖిల్ తన సినిమాల ఎంపికలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడని చెప్పవచ్చు. యావత్ దేశప్రజలకు సంబందం ఉన్న, అందరికీ ఎంతో కొంత అవగాహన ఉన్న కథాంశాలను తీసుకొని పాన్ ఇండియా మూవీలుగా తెరకెక్కిస్తుండటంతో దేశప్రజలందరూ వాటితో సులువుగా కనెక్ట్ అవుతున్నారు. దాంతో నిఖిల్ సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి.
నిఖిల్ తాజాగా స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏవిధంగా చనిపోయారనే రహస్యాన్ని చేదించగూడచారిగా ‘స్పై’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో ఈ టీజర్ను ఈరోజు విడుదలచేశారు. టీజర్ చూస్తే ఈ సినిమా కూడా అద్భుతంగా ఉండబోతోందని అర్థమవుతోంది.
ప్రముఖ సినీ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో , ఐశ్వర్య మేన్, సన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, మకరంద్ దేశ్ పాండే తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈడీ ఎంటర్టయిన్మెంట్ బ్యానర్పై కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాతే కధ అందించడం విశేషం. ఈ సినిమాకు డైలాగ్స్: అనిరుదకృష్ణమూర్తి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్, స్టంట్స్: లీ విటేకర్ & రాబర్ట్ లిన్నెన్ (హాలీవుడ్) చేస్తున్నారు. ఈ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది.