వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనందు, యామినీ భాస్కర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన ‘సైక్ సిద్ధార్థ’ నుంచి ధూం తకుం లిరికల్ వీడియో సాంగ్ నేడు విడుదలైంది. కాసర్ల శ్రీరామ్ వ్రాసిన ఈ పాట స్మరణ్ సాయి సంగీతం అందించగా జస్సీ గిఫ్ట్ ఆలపించారు. సైక్ సిద్ధార్థ్ సినిమాలో నరసింహ, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సుకేష్, వాడేకర్ నర్సింగ్, బాబీ రాతకొండ, సాక్షి ఆత్రీ చతుర్వేది, మౌనిక, ప్రద్యుమ్న ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే: శ్రీ నందు, సంగీతం: స్మరణ్ సాయి, కెమెరా: కె ప్రకాష్ రెడ్డి, ఎడిటింగ్: ప్రతీక్ నూతి చేశారు.
ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డితో కలిసి సురేష్ ప్రొడక్షన్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు. ఈ నెల 12న సైక్ సిద్ధార్థ సినిమా విడుదల కాబోతోంది.