విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో హిట్ కొట్టిన తర్వాత మరో సినిమా ఇంకా మొదలుపెట్టలేదు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కధని ఓకే చేసినట్లు తెలుస్తోంది.
వెంకటేష్ సూపర్ హిట్ సినిమాలు ‘నువ్వు నాకు నచ్చావు’, ‘మల్లీశ్వరి’కి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా చేశారు. అప్పటి నుంచి కలిసి ఓ సినిమా చేద్దామని అనుకున్నారు కానీ ఇంతవరకు కుదరలేదు.
ఇప్పుడు వెంకటేష్ ఫ్రీగా ఉండటం, అల్లు అర్జున్తో మొదలుపెట్టాలనుకున్న సినిమా ఆలస్యం అవడం వలన ఇన్నేళ్ళకు వెంకటేష్తో సినిమా చేసేందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్కు అవకాశం చిక్కింది.
ఈ జూలై నెలాఖరుకల్లా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఆగస్టులో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.